Several Film Celebrities Visited Lord Srivaru At Tirumala : తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రముఖులు శ్యామలాదేవి ( కృష్ణంరాజు సతీమణి), దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత బన్నీ వాసు, నటుడు దర్శకుడు సముద్రగనిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని దేవస్థానం హుండీలో కానుకలు సమర్పించి మెుక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖుల కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఇదిలా ఉండగా తిరుమలపై అత్యాధునిక ఏఐ ఎన్నో అద్భుతాలు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులు దర్శనం కోసం వేచియుండే సమయం ఏకంగా 63 శాతం వరకు తగ్గింది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో భక్తుల రద్దీని నియంత్రిస్తూ, రికార్డు స్థాయిలో హుండీ ఆదాయాన్ని టీటీడీ ఆర్జిస్తోంది. అయితే ఈ విప్లవాత్మక మార్పులపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఐసీసీసీ బృందాన్ని అభినందించారు.
Comments