Skip to playerSkip to main content
  • 2 days ago
Srikalahasti Rathotsavam at Chittoor District : దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీజ్ఞాన ప్రసూనాంబికాదేవి రెండు రథాలపై కొలువు దీరారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వేరు వేరు రథాలపై ఊరేగించారు. మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓం నమశ్శివాయ హరహర మహాదేవ నామస్మరణతో రథాలు ఉత్సాహంగా ముందుకు సాగాయి. ఉప్పు, మిరియాలను జంట రధాలపై చల్లి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.స్థల పురాణ: రాష్ట్రంలో శివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా శ్రీకాళహస్తిలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని కాళా బుషి నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. సహజంగా ఏర్పడిన స్ఫటిక లింగం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇది దక్షిణ భారతదేశం​లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.

Category

🗞
News
Transcript
00:02Oh
00:58Thank you very much.
01:30Oh
Comments

Recommended