Skip to playerSkip to main content
  • 11 hours ago
Londan Girl Debut Bharatanatyam In Hyderabad : కూచిపూడి రంగప్రవేశం నేత్రపర్వంగా సాగింది. లండన్​లో పుట్టి పెరిగినా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళల్ని మరిచిపోకుండా భరతనాట్యంలో అడుగులు నేర్చుకున్న యువ నర్తకి, హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్​లో అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. కళసాగరా (అమెరికా) సంస్థ ఆధ్వర్యంలో నాట్యగురువు ఆచార్య రత్న ఉషా రాఘవన్ పర్యవేక్షణలో నర్తకి నీటి రౌధూర్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. పుష్పాంజలి, అలరిప్పు, వర్ణం, దేవి స్తుతి, అన్నమాచార్య కీర్తన, తిల్లాన వంటి అంశాలను చక్కటి హావభావాలతో సమర్థవంతంగా ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది.శాస్త్రీయ సంగీత, నృత్య కళలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. నేటితరానికి ఈ కళల పట్ల ఆసక్తిని పెంపొందించాలన్నారు. ఈ సందర్భంగా నీటితో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గురువును సముచితంగా సత్కరించారు. కార్యక్రమంలో నీటి తల్లిదండ్రులతో పాటు పలువురు నృత్య ప్రముఖులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నీటి రౌధూర్​ను అభినందించారు.

Category

🗞
News
Comments

Recommended