Telangana Governer Shiva Prathap Shukla In Tirumala : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం (జూన్ 22) దర్శించుకున్నారు. ఈరోజు వేకువజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని మహాద్వారం దగ్గరకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ అధికారులు డిప్యూటీ ఈవో లోకనాథం, పండితులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వారి దర్శనానికి కావాల్సిన తగు ఏర్పాట్లు చేశారు. గవర్నర్ దంపతులు స్వామివారిని దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం చేశారు. దర్శనం అయ్యాక గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆలయ అధికారులకు హస్తలాఘవం చేసుకొని వీడ్కోలు తెలిపారు. అనంతరం కారులో కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు.
Comments