Skip to playerSkip to main content
  • 20 hours ago
Republic Day Celebrations At Ramoji Film City: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయేశ్వరి రామోజీ ఫిల్మ్​సిటీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రామోజీరావు మనవడు సీహెచ్​ పూర్ణ సుజయ్‌ హాజరయ్యారు. వేడుకల్లో ఆర్​ఎఫ్​సీ, ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌, డాల్ఫిన్ హోటల్స్​కు చెందిన వివిధ విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సందడిగా జరిగాయి. సికింద్రాబాద్​లోని పరేడ్​ మైదానంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ ​వర్మ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 

Category

🗞
News
Transcript
00:00What
00:30Transcription by CastingWords
01:00Transcription by CastingWords
01:30Transcription by CastingWords
Comments

Recommended