Skip to playerSkip to main content
  • 2 months ago
Bhatti Vikramarka At Tirumala : వచ్చే శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్దికి దోహదపడేలా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన భట్టి విక్రమార్క, శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన భట్టి కుటుంబం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.తన పెద్ద కుమారునికి వివాహమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు విచ్చేసినట్లు భట్టి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య – సాక్షిలకు ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బడ్జెట్ ఉంటుందన్న భట్టి, కావలసిన వనరులు సమకూరేలా తెలంగాణ విజన్-2047 డ్యాకుమెంట్‌ సమగ్రాభివృద్ధికి స్వామివారి సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
Comments

Recommended