Vottimitta SeethaRamula Kalyanam : కడప జిల్లాలో ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవానికి టీటీడీ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది. కోదండ రామయ్య కల్యాణం సాయంత్రం 6.30 నిమిషాల నుంచి 8.30 వరకు జరగనుంది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు సతీసమేత రామయ్యకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కనుల పండువగా జరిగే ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కళ్యాణ ప్రాంగణంలోకి భక్తుల్ని అనుమతిస్తారు. శాశ్వత కళ్యాణ వేదికలో జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనాలతో టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 120 గ్యాలరీలు ఏర్పాటు చేసి కూలర్లు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, తీర్థప్రసాదాలు అన్నీ కూడా భక్తులకు అందజేయనున్నారు. భారీగా ఎల్ఈడి తెరలు కూడా ఏర్పాటు చేశారు. లక్ష మంది భక్తజనానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 2,500 మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Comments