Housewarming Ceremony in Pandalaparru : తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల లక్ష్మీ దుర్గేశ్ పర్యటించారు. నిడదవోలు మండలం పందలపర్రులో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గృహ నిర్మాణం చేసిన దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన ఇల్లు మన గౌరవం అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తుందని అన్నారు. గృహ నిర్మాణాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి అధిక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులు పొందలేకపోయారని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు పేరుతో ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతాల్లో రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్, మంచి నీటిసదుపాయం తదితర కనీస సదుపాయాలు లేవని చెప్పారు. ఆ ప్రాంతాల్లో రహదారులు నిర్మించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశీస్సులతో నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి 28 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని మంత్రి వెల్లడించారు.
Comments