Sitarama Kalyanam at Bhadrachalam : లోకకల్యాణంగా భావించే రాములోరి కల్యాణం భద్రాద్రి దివ్వక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగింది. జగాలను ఏలిన జగదేకవీరుడు, జగన్మాత సీతమ్మ అభిజిత్ లఘ్నంలో ఒక్కటయ్యారు. రామ భక్తులు వీక్షించే అతిపెద్ద దైవకార్యమైన ఈ మహోత్సవం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆవిష్కృతం అయ్యింది. ఎన్ని కష్టాలు వచ్చినా దాంపత్య బలం అన్నింటినీ జయిస్తుందనడానికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట చూసిన వారికి చూడముచ్చటగా నిలిచింది. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే, జానకి దోసిట తలంబ్రాలు కెంపులవనున్నాయి. ఈ కమనీయ వేడుక రామ భక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. భద్రాద్రి క్షేత్రంలోని మిథిలా మండపంలో అత్యంత వైభవోపేతంగా సాగిన కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రామ భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాలు తీసుకువచ్చి ఈ క్రతువులో భాగమయ్యారు. ఈసారి 300 క్వింటాళ్ల ఆక్షింతలను దేవస్థానం భక్తులకు పంపిణీ చేసింది.
Comments