Politician Attacked In Bhuvanagiri : భువనగిరి మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో గెలుపొందిన అభ్యర్థి భువనేశ్వరి ఇంటిపై ఓడిపోయిన అభ్యర్థి కుటుంబసభ్యులతో పాటు మరికొంత మంది ఖాళీ సీసాలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలనీలో తమకు ఓటు వేయలేదని తాము ఇచ్చిన చీరలతో పాటు బహుమతులు వెనక్కి ఇవ్వాలని ఓడిన అభ్యర్థి వర్గీయులు ఘర్షణకు దిగారు. వారికి పంచిన చీరలను, రైస్ కుక్కర్లను కాలనీ వాసులు ఓడిన అభ్యర్థి ఇంటి ముందు వేశారు. మరి కొంతమంది చీరలను తగలబెట్టారు. బాధితులు, కాలనీ వాసుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఒక్కసారిగా ఈ ఊహించని ఘటనతో స్థానికంగా కాసేపు గందరగోళం నెలకొంది.
Comments