Skip to playerSkip to main content
  • 21 minutes ago
Balkampet Yellamma Temple : హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం ఆషాఢ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమాభిషేకాలు, మంగళహారతులు వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని, అమ్మవారిని సుమారు 10 టన్నుల వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అద్భుతంగా అలంకరించారు. శాకంబరీ అవతారంలో వెలిసిన అమ్మవారి రూపాన్ని దర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లలో బారులు తీరారు. ఆషాఢ మాసం సందర్భంగా మహిళా భక్తులు సంప్రదాయ బద్ధంగా బోనాలు సమర్పిస్తూ, వడియాలు పోస్తూ, తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, తీర్థప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి భక్తుడు సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Category

🗞
News
Transcript
00:28This video is brought to you by Kiko Kiko Kiko.
Comments

Recommended