Jonnavada Sahasra Ghattabhishekam : వర్షాలు కురిసి, కరువు పరిస్థితులు తొలగిపోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో సహస్ర ఘట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పెన్నా నది నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చారు. అనంతరం 1008 ఘట్టాలతో మల్లికార్జున స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించామని ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వరుణ దేవుని అనుగ్రహం కోసం ఈ పూజలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ "దేవాదాయశాఖ ఉత్తర్వుల మేరకు ఈ రోజు శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో సహస్ర ఘట్టాభిషేకాన్ని నిర్వహించాం. అర్చకులు పెన్నా నది నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి 1008 ఘట్టాలతో మల్లికార్జున స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. కరువు పరిస్థితులు తొలగిపోవాలని పాడి పంటలు సమద్ధిగా పండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది" అని అన్నారు.