Gangamma Thirunalla Mahotsavam at Bapatla District : బాపట్ల జిల్లా కారంచేడులో జగజ్జనని లోకమాత గంగాభవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ సందర్బంగా పోలేరమ్మ, గంగాభవాని అమ్మవార్లకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రతిరూపాలతో కూడిన విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో కారంచేడు పురవీధుల్లో ఉరేగించారు. కేరళ డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ తిరునాళ్లలో చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కారంచేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంగాభవాని పూజలు, తిరునాళ్లు ప్రజలు భక్తి శ్రద్ధలతో, ప్రత్యేక సాంప్రదాయాలతో నిర్వహించారు. దీంతో గ్రామమంతా జనసంద్రంగా మారింది. భక్తులు మేళతాళాలు, వాద్యాల నడుమ నృత్యాలు చేస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. గంగా భవాని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ మొక్కలను చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లి గంగాభవాని అని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమాలను ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
Comments