Skip to playerSkip to main content
  • 2 days ago
​9 Foot Snake in Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలలో భారీ పాము కలకలం రేపింది. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే కొండపై అప్పుడప్పుడు వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయి. తాజాగా నారాయణగిరి ఉద్యానవనం వద్ద జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నారాయణగిరి ఉద్యానవన ప్రాంతంలోని షెడ్ల వద్ద అకస్మాత్తుగా ఓ భారీ పాము ప్రత్యక్షమైంది. సుమారు తొమ్మిది అడుగుల పొడవున్న ఆ జెర్రీపోతు పామును చూసి టీటీడీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాము పరిమాణం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. షెడ్ల వద్ద హల్ చల్ చేస్తున్న తొమ్మిది అడుగుల జెర్రీపోతును ఆయన ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఏమాత్రం భయం లేకుండా అత్యంత నైపుణ్యంతో దానిని బంధించారు. అనంతరం ఆ పామును సురక్షితంగా తీసుకెళ్లి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Category

🗞
News
Transcript
00:01Oh
Comments

Recommended