Ontimitta Rathotsavam in YSR Kadapa : వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట పరిధిలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఏడో రోజున రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు శరత్, వీరబ్రహ్మం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తేరు చక్రాలు కదిలాయి. భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని ముందుకు లాగారు. ఈ సందర్భంగా భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వీధుల గుండా రథం సాగుతుండగా అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించారు. స్వామివారిని దర్శించి వారు తన్మయత్వానికి లోనయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు.
Comments