Skip to playerSkip to main content
  • 2 days ago
Prominent Personalities In Tirumala: ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మాజీ క్రికెటర్ శ్రీకాంత్, పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్, ఐఏఎస్ ఆమ్రపాలి ఉన్నారు. ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్న ఈ ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  సీఎం చంద్రబాబునాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆ వేంకటేశ్వర స్వామిని కోరుకున్నా. సీఎం చంద్రబాబునాయుడు ఆరోగ్యం బాగుంటే రాష్ట్రం కూడా బాగుంటుంది. పారిశ్రామిక రంగంలో జరిగిన ఏం.ఓ.యులు కార్యరూపం దాలిస్తే 20 లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో రంగాల్లో అభివృద్ధి జరిగింది. మా ప్రభుత్వం వచ్చాక శ్రీవారి ఆలయం కూడా శుద్ధి చేశాం. కర్నూలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. -టీజీ భరత్, మంత్రి 

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
Comments

Recommended