Pidakala Fight Celebrations in Kairuppala At Kurnool District: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో నుగ్గులాట (పిడకల సమరం) సంబరంగా నిర్వహించారు. ప్రతీ ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు జరిగే ఈ పిడకల సమరాన్ని చూసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గ్రామంలోని వీరభద్ర స్వామి, భద్రకాళి ప్రేమాయణంలో తలెత్తిన ఓ చిన్న వివాదానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారని ప్రతీతి. పిడకల సమరం సందర్భంగా ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలో పాల్గొనడానికి సమీప గ్రామాలైన పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి, వలగొండ, పుట కలమర్రి, యాటకల్లు గ్రామాల ప్రజల వారు రెండు వర్గాలుగా విడిపోయి అప్పటికే గ్రామంలో సిద్ధంగా ఉంచిన పిడకలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అనాదిగా పిడకలతో కొట్టుకోవడం ఆచారంగా వస్తోంది. పిడకల సమరంలో 36 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారు స్వామి వారి విభూతి రాసుకున్నారు. ఇలా రాసుకుంటే గాయాలు మానిపోతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
Comments