Motorists Protest Against Toll Plaza Staff : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం టోల్ ప్లాజా దగ్గర వాహనదారులు సిబ్బందితో ఆందోళనకు దిగారు. సమీపంలో ఉన్న తమ గ్రామానికి వెళ్లాలంటే రూ. 250 చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ ప్లాజా పక్కన ఉన్న గ్రామాల్లోకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులు, టోల్ ప్లాజా సిబ్బందితో చర్చించారు. గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రహదారి చూపించాలని టోల్ ప్లాజా సిబ్బందికి డిమాండ్ చేశారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని టోల్ ప్లాజా సిబ్బంది హామీ ఇచ్చారు."ఏలూరు నుంచి వస్తూ వెంకటపాలెం ఊర్లోకి వెళ్లాలంటే రెండు నిమిషాల్లో రెండు టోల్గేట్ ఫీజులు కడుతున్నాం. టోల్ప్లాజా సిబ్బంది యాక్సెస్ ఇవ్వకపోవడం వల్ల ఒకే కారుకు రెండు టోల్గేట్లు కడుతున్నాం. ఆఫ్ కిలోమీటరు కూడా లేనిదానికి కిలోమీటరున్నర తిరగాల్సి వస్తుంది. మాకు రూ.250 అవుతుంది". -మందరపుల్లా కృష్ణ, వాహనదారుడు
Comments