Skip to playerSkip to main content
  • 2 weeks ago
Villagers Express Gratitude To Deputy CM Pawan For School Construction : అరకు నియోజకవర్గం పెదపాడులో పాఠశాల భవనం నిర్మిస్తామని ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నెరవేర్చారు. రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనం అందుబాటులోకి వచ్చినట్లు పవన్ వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ 7వ తేదీ అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో పవన్ అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు.పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. స్కూలు శిథిలావస్థకు చేరిందని కొత్త భవనం కావాలని ఉపాధ్యాయులు రంగయ్య పవన్​కు విన్నవించారు. పాఠశాలకు కొత్త భవనం నిర్మిస్తామని పవన్ సభావేదికపై హామీ ఇచ్చారు. అప్పటి హామీ మేరకు చక్కటి పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం 2026 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది. విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీని నెరవేర్చటంపై పెదపాడు గ్రామస్తులు పవన్ కల్యాణ్​కు కృతజ్ఞతలు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:01Thank you very much.
00:30Thank you very much.
Comments

Recommended