NTA 10th Anniversary Celebrations : నార్వేలో ఉగాది వేడుకలు, నార్వే తెలుగు అసోసియేషన్ పదో వార్షికోత్సవం ఎన్టీఏ (నార్వే తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఓస్లో సిటీలో నిర్వహించిన ఈ వేడుకలకు నార్వేలోని భారత రాయబారి గ్లోరియా గాంగ్టే, ఆస్కర్ మేయర్ లెనె కాన్రాడి, ఆస్కర్ కొమ్నీ డిప్యూటీ మేయర్ ఓలే జాకబ్ జోహన్సెన్, ఇండియన్ ఎంబసీ రెండో కార్యదర్శి మాగేశ్ కుమార్ అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడియో సందేశం ద్వారా తమ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నాట్య కళా భారతి డాక్టర్ సరళ కుమారి కూచిపూడి డ్యాన్స్, స్థానిక ప్రవాస చిన్నారుల సాంస్కృతిక, ముద్ర డ్యాన్స్ అకాడమీ, స్టాక్ హోమ్ 'అలెన్ స్కూల్ ఆఫ్ డ్యాన్సెస్' ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వారి సేవలకు గుర్తింపుగా మాజీ బోర్డు, కార్యవర్గ సభ్యులను సత్కరించారు.
Comments