Minister Mandipalli Ramprasad Conduct Blood Donation Camp For Thalassemia Children: అన్నమయ్య జిల్లా గాలివీడులోని బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సేవాభావం స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం తలసేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా పాల్గొని రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహాదానమని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు. మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదో సారి రక్తదానం చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు."రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహాదానం. ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనది. మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదో సారి రక్తదానం చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి". -మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి
Comments