A Man Created Mess On Gangavaram Flyover : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంగవరంలో సైకో వీరంగం సృష్టించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా తిరుగుతున్నాడు. దీంతో గ్రామస్థులంతా భయపడిపోయారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి పోలీసుల వాహనం లాక్కొని పారిపోయాడు. గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటో, కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయి దగ్గరలో ఉన్న చెరువులో దూకేశాడు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు కష్టపడి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు పక్కకు నిలిపి టిఫిన్ చేసే క్రమంలో ఇలా జరిగిందంటూ బాధితులు తమ బాధను వ్యక్త పరుస్తున్నారు.
Comments