Telangana Bhavan is Night View : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కాంతులీనుతోంది. సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవన్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దాంతో తెలంగాణ భవన్ గులాబీ వర్ణంతో ఆకట్టుకుంటోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించి సుదీర్ఘ పోరాటం చేసిన బీఆర్ఎస్, సోమవారం ఆవిర్భావ వేడకను ఆ పార్టీ నాయకత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తొలుత టీఆర్ఎస్గా ఉన్న పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే.గతేడాది రజతోత్సవ సభ నిర్వహించగా, ఈ ఏడాది రజతోత్సవ కార్యక్రమాల ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంపై అధినేత కేసీఆర్ గులాబీ జెండాను ఎగుర వేయనున్నారు.
Comments