Skip to playerSkip to main content
  • 1 week ago
Road Accident in D Hirehal : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డి.హీరేహల్‌ మండలం జాజరకల్‌ టోల్‌ ప్లాజా వద్ద రెండు లారీలు ఢీకొని ఒకరు సజీవదహనమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటకలోని తోరణగల్ వద్దనున్న జిందాల్ ప్లాంట్​ నుంచి సిమెంట్ రవాణా చేస్తున్న లారీ టోల్‌గేట్ వద్దనున్న పంక్చర్ షాప్ వద్ద ఆగింది. ఆ సమయంలో బళ్లారి వైపు కంకరలోడుతో వెళ్తున్న లారీ వచ్చి దీనిని బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే రెండు లారీల్లో పెద్దఎత్తున్న మంటలు చెలరేగి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కంకర లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. దీనిపై స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమాచారమిచ్చారు. ఫైర్​ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై డి.హీరేహాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంకరలోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Category

🗞
News
Comments

Recommended