Skip to playerSkip to main content
  • 6 weeks ago
Yadagirigutta Temlpe Staff Struggles : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రసాదం తయారీకి సంబంధించిన సరుకుల రవాణాకు అక్కడి సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. దేవస్థానం నిర్వహించే ప్రసాదాల తయారీ విభాగానికి నెయ్యి, మంచి నూనె క్యాన్లను నేరుగా సులభరీతిలో చేర్చే సదుపాయం లేదు. దీంతో ఇలా మెట్లపై నుంచే చేర్చాల్సి వస్తోంది. ఇతర సరుకులను సునాయాసంగా చేర్చేందుకు ప్రత్యేక కన్వేయర్ బెల్టు ఉంది. అయితే ఇవి క్యాన్లను తీసుకెళల్లేదు. దీంతో నూనె, నెయ్యి క్యాన్లను భుజాన మోసుకెళ్లాల్సివస్తోంది. అంత ఎత్తు మోయలేక ఇలా మెట్లపై లాక్కెళుతున్నారు. వీటిని మోసుకెళ్లేవారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సంబంధిత వ్యక్తికి ప్రమాదం జరగొచ్చు. లేదా క్యాన్ జారి పడితే నెయ్యి నేలపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యపై సత్వరమే అధికారులు స్పందించి పరిష్కరం చూపాలని పలువురు స్థానికులు, భక్తులు కోరుతున్నారు. మనం టెక్నాలజీ రంగంలో ఎంతో ముందుకు వెళ్తుంటే, ఇప్పటికే ఇలా క్యాన్లను కొండపైకి తరలించడం పట్ల భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

 

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended