Skip to playerSkip to main content
  • 8 years ago
Commerce and Industry Minister Suresh Prabhu said the Centre will support iPhone maker Apple to set up manufacturing unit in the country and is awaiting a formal proposal from them.

ప్రముఖ టెక్ ధిగ్గజం ఆపిల్.. తన యూనిట్‌ను ఇండియాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోందని కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అయితే ఇంకా ఆపిల్ నుండి అధికారిక ప్రతిపాదన రావాల్సి ఉందన్నారు. ప్రపంచ టెక్ ధిగ్గజం ఆపిల్ కంపెనీ ఇండియాలో తన యూనిట్‌ను ఏర్పాటు చేస్తే టెక్కీలకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆపిల్ కంపెనీ ఇండియాలో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు రాయితీలను కోరుతోందని కేంద్ర పరిశ్రమల శాఖకు చెందిన వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.ఆపిల్ తయారీ యూనిట్‌లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగ వివరాలను వంటి వాటిని కేంద్రం ఆపిల్‌ నుంచి కోరుతోంది. మరో వైపు ఆపిల్‌ కోరుతున్న చాలా డిమాండ్లను కేంద్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదని మార్చి నెలలో అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended