Skip to playerSkip to main content
  • 1 day ago
One Way Traffic System At KBR Park : కేబీఆర్​ పార్క్​ చుట్టూ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వన్​ వే ట్రాఫిక్​ విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉదయం 9 గంటల వరకు సాఫీగా సాగింది. రోడ్ నెం.45, అగ్రసేన్ జంక్షన్, వెంకటగిరి వద్ద వాహనాల లైన్ చేంజింగ్‌లో మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్​ నియంత్రణ కోసం క్షేత్రస్థాయిలో 500 మందికి పైగా పోలీసు సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్​ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్​ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలకు సహకరిస్తున్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వన్ వే విధానాన్ని మరింతగా మెరుగుపరుస్తామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రస్తుతం పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్​ చెక్​ పోస్టు, రోడ్​ నెం. 45 మీదుగా ఐటీ కారిడార్​కు వెళ్లే వాహనదారులు కేబీఆర్​ పార్క్​ జంక్షన్​ నుంచి బసవతారకం, ఫిల్మ్​ నగర్​ మీదుగా రోడ్​ నెం.45 చేరుకుని అక్కడ నుంచి ఐటీ కారిడార్​కు చేరుకోవచ్చు. రోడ్డుకు రెండు వైపులా వన్​ వే ను అమలు చేశారు. 

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended