One Way Traffic System At KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వన్ వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉదయం 9 గంటల వరకు సాఫీగా సాగింది. రోడ్ నెం.45, అగ్రసేన్ జంక్షన్, వెంకటగిరి వద్ద వాహనాల లైన్ చేంజింగ్లో మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం క్షేత్రస్థాయిలో 500 మందికి పైగా పోలీసు సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలకు సహకరిస్తున్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వన్ వే విధానాన్ని మరింతగా మెరుగుపరుస్తామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రస్తుతం పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెం. 45 మీదుగా ఐటీ కారిడార్కు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం, ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెం.45 చేరుకుని అక్కడ నుంచి ఐటీ కారిడార్కు చేరుకోవచ్చు. రోడ్డుకు రెండు వైపులా వన్ వే ను అమలు చేశారు.
Comments