Mission Bhagiratha Pipeline Burst : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు పైకి ఎగిసి పడింది. భారీగా తాగు నీరు వృథా అయ్యింది. పైప్లైన్ పగలడంతో సుమారు 15 నుంచి 20 అడుగుల ఎత్తుకు నీరు ఎగిసింది. ఫౌంటేన్ మాదిరిగా నీరు ఎగిసిపడుతుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.వేములవాడ చొప్పదండి నియోజకవర్గానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ కావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు నీరు పైకి ఎగిసిపడటంతో రోడ్డుపై నీరు ప్రవహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారిపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ మార్గం గుండా ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైప్లైన్ పగిలిన విషయాన్ని గుర్తించిన అధికారులు, నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.
Comments