Skip to playerSkip to main content
  • 1 day ago
Mission Bhagiratha Pipeline Burst : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం వద్ద మిషన్ భగీరథ పైప్​లైన్ పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు పైకి ఎగిసి పడింది. భారీగా తాగు నీరు వృథా అయ్యింది. పైప్‌లైన్ పగలడంతో సుమారు 15 నుంచి 20 అడుగుల ఎత్తుకు నీరు ఎగిసింది. ఫౌంటేన్​ మాదిరిగా నీరు ఎగిసిపడుతుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు ఆ దృశ్యాలను తమ సెల్​ఫోన్​లలో చిత్రీకరించారు.వేములవాడ చొప్పదండి నియోజకవర్గానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే ప్రధాన పైప్​లైన్ కావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు నీరు పైకి ఎగిసిపడటంతో రోడ్డుపై నీరు ప్రవహించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారిపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ మార్గం గుండా ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైప్​లైన్​ పగిలిన విషయాన్ని గుర్తించిన అధికారులు, నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended