Bonalu Celebrations In Sangareddy : రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢమాస బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ బోనాల జాతర వేడుకలు ఉత్సవంలా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఇదే క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనూ బోనాల ఉత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ జాతరను గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని డప్పుల చప్పులతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోతరాజులతో కలిసి స్టెప్పులు వేసి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు. యువత మత్తు పదార్థాలకు, ఫోన్లకు దూరంగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు.
Comments