Skip to playerSkip to main content
  • 8 hours ago
Banana Farmers Agitation For Price Fall Down in Anantapur District: మార్కెట్​లో ధరలు తగ్గి అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లిఖార్జున తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట అరటి గెలలు కుప్పపోసి రైతులతో కలిసి ఏపీ రైతు సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. అధిక పెట్టుబడితో సాగుచేసిన అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా చూపి అరటి ధరలు తగ్గించారని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతుల పంటను కొనుగోలు చేయడంతోపాటు, లాభసాటి ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే కోత దశకు వచ్చిన అరటిని ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో గెలల నాణ్యత బాగుండటంతో వ్యాపారులంతా ఆయా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు."అధిక పెట్టుబడితో సాగుచేసిన అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. అధిక పెట్టుబడితో సాగుచేసిన అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అరటి రైతుల సమస్యలను అధికారులు పరిష్కరించాలి. రైతుల పంటను కొనుగోలు చేయడంతోపాటు, లాభసాటి ధర దక్కేలా చర్యలు తీసుకోవాలి. తక్షణమే కోత దశకు వచ్చిన అరటిని ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలి" -మల్లిఖార్జున,ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:59Thank you very much.
01:09Thank you very much.
01:31Thank you very much.
Comments

Recommended