Offering Golden Bonam to LalDarwaza Mahankali : తెలంగాణలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చరిత్రాత్మక పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకల్లో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్ ఇంటి నుంచి అత్యంత వైభవంగా అమ్మవారికి బంగారు, వెండి బోనం సమర్పించారు. నిజాం కాలంలో వరదలు వచ్చినప్పుడు అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిసి వరదలను అదుపు చేశారని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ వస్తున్నారని తెలిపారు. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆరాధిస్తారని చెప్పారు. ఆగస్టు 9, 10 తేదీల్లో అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. ఈ ఆదివారం ఆగస్టు 2న సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు.
Comments