Special Prayers at Vargal Vidya Saraswati Temple : ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనిమిచ్చారు. అమ్మను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో శాకాంబరీ దేవిగా సుందరంగా అలంకరించారు. ఆలయం అంతటా పండ్లు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణలు చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించిన భక్తులు అమ్మవారి దివ్య దర్శనం తమకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో సందడిగా మారింది.
Comments