Skip to playerSkip to main content
  • 5 days ago
Cine Actresses Visit Tirumala Temple: తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ, సినీతారలు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటీమణులు దేవర చిత్రంలో నటించిన కథానాయిక జాన్వీ కపూర్, అదే విధంగా కాంతార, తమ్ముడు తదితర చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన సప్తమి గౌడలు శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు.ముందుగా వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జాన్వీ కపూర్, సప్తమి గౌడలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దాంతో టీటీడీ అధికారులు వారికి సాదర స్వాగతం పలికి దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన జాన్వీ కపూర్, సప్తమి గౌడలు స్వామివారిని దర్శించుకొని తమ మ్రొక్కులను చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.అంతేకాకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు కవితకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

Category

🗞
News
Comments

Recommended