Free Bus To All at Godavari Khani : రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు బస్సులను అద్దె, ఔట్ సోర్సింగ్ విధానంలో నడపడానికి సిద్ధం చేసింది. ఇదే నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో కూడా బస్సులను నడిపేందుకు సన్నద్ధం అయ్యింది. అయితే ఆ బస్సులనన్నింటినీ ఉచితంగా నడిపించింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం అద్దె బస్సులు, డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని బస్సులను నడిపిస్తున్నారు. కండక్టర్లు అందుబాటులో లేకున్నప్పటికీ పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడిపిస్తున్నారు. ఇలాంటి ఉచిత రవాణా వ్యవస్థ వల్ల ఆర్టీసీకి ఒక్క రోజుకు లక్షల రూపాయల ఇంధనం ఖర్చు అయ్యే పరిస్థితులున్నాయి. అయితే రోజంతా ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రజలంతా బస్సు ప్రయాణాలకు మొగ్గుచూపారు. స్త్రీలతో పాటు పురుషులకూ ఉచిత సౌకర్యం కల్పించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Comments