Skip to playerSkip to main content
  • 1 week ago
Anna Lezhneva Visited Bhadrakali Temple in Warangal : ఏపీ డిప్యూటీ సీఎం, తెలుగు అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా వరంగల్​లో ప్రముఖ ఆలయంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న సాదర స్వాగతం పలికారు. తొలుత ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్నపన మండపంలో ముఖ్యఅర్చకులు వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్‌ కుమార్‌ శర్మ మహదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, తీర్థ ప్రసాదాలను లెజినోవాకు అందజేశారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో తమ కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్ సింగపూర్​లో అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నదానం ట్రస్టుకు రూ.17లక్షల చెక్కును కూడా ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజినోవా

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
Comments

Recommended