Interview With APTS MD And Chairman : రోజు రోజూకీ సవాల్ విసురుతున్న సైబర్ నేరాల నుంచి ప్రజల్ని రక్షించడం, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యం కల్పించేందుకు నిరంతరాయంగా సేవలు, పర్యవేక్షణ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్) ఎండీ సూర్యతేజ, ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కేంద్రం (ఏపీ సీసాక్) ఆధ్వర్యంలో అన్ని రకాల డేటాలు, గోప్యత, సైబర్ ఎటాక్లు వంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాటిని నియంత్రించేందుకు నిపుణుల్ని తయారు చేసేందుకు యువతను ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకులు, పోలీసులతో పాటు వివిధ ఆర్థిక సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ అన్నారు. సైబర్ సెక్యూరిటీ ద్వారా ఆదాయం, ఉపాధి కల్పన, ప్రైవేటు రంగానికి మరింత సేవలు విస్తరించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెబుతున్న ఏపీటీఎస్ ఛైర్మన్, ఎండీతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.
Comments