Pinkathon at Necklace Road : హైదరాబాద్ నెక్లెస్రోడ్డు ఈ ఉదయం ఒక అపురూప దృశ్యానికి వేదికైంది. జైడస్, ప్రముఖ నటుడు, ఫిట్నెస్ నిపుణుడు మిలింద్ సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పింకథాన్లో 5 వేల మంది వృద్ధులు, మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో జరిగిన పరుగును తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్స్ అథారిటీ) వైస్ ఛైర్మన్ సోనీ బాల, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. విభిన్న వయసులోని వందలాది మంది మహిళలు, అంద విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఫిట్నెస్ అవసరాన్ని నిరూపించారు.వయస్సు, కట్టుబాట్లు శారీరక శ్రమకు అడ్డంకి కావనే పింకథాన్ నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. 2025-26 జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఈవెంట్కు సన్నాహకంగా నిర్వహించిన ఈ పరుగు, సంప్రదాయం లేదా సామాజిక అంచనాలు మహిళల ఆరోగ్యాన్ని ఎప్పుడూ పరిమితం చేయకూడదనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించింది. మహిళలు తమ దైనందిన జీవితంలో ఆరోగ్యాన్ని ఒక భాగంగా చేసుకోవాలనే లక్ష్యంతో ఈ వినూత్న ఫార్మాట్ను రూపొందించినట్లు మిలింద్ సోమన్ తెలిపారు. ఆరోగ్యం పట్ల మహిళలకు ఉన్న ఆసక్తి ఈ రన్ ద్వారా స్పష్టంగా కనిపించిందన్నారు.
Comments