Skip to playerSkip to main content
  • 2 days ago
MVR INDUSTRIES MADHURI INTERVIEW : ఒకప్పుడు ఆమె చిరు ఉద్యోగి. నెలవారీ జీతం మీదనే ఇంటిని పొషించుకునేవారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రొత్సాహకాన్ని అందిపుచ్చుకున్నారు. ఎంవీఆర్ పేరుతో కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పరిశ్రమను స్థాపించారు. సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తులు తయారు చేస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తగా విజయాలు సాధిస్తున్నారు. ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. రేపటి భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలని రసాయిన రహిత ఆహర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర నలూమూలల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎగుమతులు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. చదువుకున్న మహిళలు జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఉన్నా, అచరణలో మాత్రం వెనుక ఉంటున్నారని ఎంవీఆర్ ఇండస్ట్రీస్ అధినేత మాధురి అంటున్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని, ఆ దిశగానే పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్న వారికి అనేక ప్రొత్సహకాలు ఇస్తున్నారని చెప్పారు. మహిళలు ఆర్ధిక స్వాలంబనవైపు అడుగులు వేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

Category

🗞
News
Comments

Recommended