Skip to playerSkip to main content
  • 23 minutes ago
Aarambh to Pinnacle B-School Fest 2026 : విద్యార్థులు సంప్రదాయ ప్లేస్‌మెంట్‌లకు బదులుగా వ్యాపారం, ఉన్నత విద్య, సివిల్‌ సర్వీస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్‌ అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'ఆరంబ్ టూ పినాకిల్' పేరుతో నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమం సందడిగా ప్రారంభమైంది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థలను విజయవంతం చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పాల్గొన్న సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఫెస్ట్‌లో నిపుణుల ఉపన్యాసాలు, విద్యార్థుల కోసం 'ఆరంభ్‌ పిచ్‌ ట్యాంక్‌' తదితర 17 రకాల పోటీలు, ఫ్యాషన్‌ షో, నృత్యం, సంగీతం, వినోదాత్మకమైన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇవాళ సాయంత్రం కళాంజలి ఆధ్వర్యంలో విద్యార్థుల ఫ్యాషన్‌ షో జరుగనుంది. ఈ సందర్భంగా ఆచరణాత్మక ఆలోచనా దృక్పతంతో ఉన్నత శిఖరాలు అందుకోవాలని వక్తలు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్​, టీహబ్​ మాజీ సీఈఓ మహంకాళీ శ్రీనివాస రావు, అడ్మినిస్ట్రేటివ్​ స్టాఫ్​ కాలేజి ఆఫ్​ ఇండియా డైరెక్టర్​ రమేశ్​ కుమార్​, డీన్​ నిర్మల్య బాగ్చీ సహా పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
Comments

Recommended