Aarambh to Pinnacle B-School Fest 2026 : విద్యార్థులు సంప్రదాయ ప్లేస్మెంట్లకు బదులుగా వ్యాపారం, ఉన్నత విద్య, సివిల్ సర్వీస్ల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'ఆరంబ్ టూ పినాకిల్' పేరుతో నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమం సందడిగా ప్రారంభమైంది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థలను విజయవంతం చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పాల్గొన్న సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఫెస్ట్లో నిపుణుల ఉపన్యాసాలు, విద్యార్థుల కోసం 'ఆరంభ్ పిచ్ ట్యాంక్' తదితర 17 రకాల పోటీలు, ఫ్యాషన్ షో, నృత్యం, సంగీతం, వినోదాత్మకమైన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇవాళ సాయంత్రం కళాంజలి ఆధ్వర్యంలో విద్యార్థుల ఫ్యాషన్ షో జరుగనుంది. ఈ సందర్భంగా ఆచరణాత్మక ఆలోచనా దృక్పతంతో ఉన్నత శిఖరాలు అందుకోవాలని వక్తలు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్, టీహబ్ మాజీ సీఈఓ మహంకాళీ శ్రీనివాస రావు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా డైరెక్టర్ రమేశ్ కుమార్, డీన్ నిర్మల్య బాగ్చీ సహా పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments