Telangana First Glass Bridge Built in Yellamma Cheruvu in Husnabad : తెలంగాణలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రెడీ అవుతోంది. కాకతీయుల కాలంనాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీని నిర్మాణం అత్యంత అద్బుతంగా రూపుదిద్దుకుంటోంది. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి గాజు వంతెన ఇదే కావడంతో పనులు పూర్తి కాకముందే చూడటానికి భారీగా ప్రజలు వస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ డ్రోన్ కెమెరా దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో నియోజకవర్గానికి సులభంగా నిధులు వస్తున్నాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే విధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పలు రకాల సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.
Comments