One More Service Flight For Rajamahendravaram To Hyderabad : రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో నూతన సర్వీస్ ప్రారంభమైంది. ఫ్లై91 విమానయాన సంస్థ హైదరాబాద్కు కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి విమానం ల్యాండింగ్ అయిన వెంటనే రన్వేపై నీళ్లు చిమ్ముతూ కొత్త సర్వీసుకు స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి, విమానాశ్రయ డైరెక్టర్, ప్రీతా సంస్థ ప్రతినిధులు, మేనేజరు జగన్మోహనరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త విమాన సర్వీసు ప్రతీ రోజూ మధ్యాహ్నం 12.40కి చేరుకుని, తిరిగి ఒంటిగంట ఐదు నిమిషాలకు హైదరాబాద్ బయలుదేరుతుంది. ఈనెల 17వ తేదీ నుంచి ఇదే విమానయాన సంస్థ మరో సర్వీసును నడపనుంది. ఉదయం 8.50 గంటలకు ఇక్కడికి చేరుకుని తిరిగి 9.15 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే హైదరాబాద్కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 8కి చేరనున్నాయి.
Comments