Anchor Suma Kanakala Visit Vemulawada Temple : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి వారిని ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అన్నారు. ఆ శివుడి ఆజ్ఞతో మొట్ట మొదటి సారి స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. సుమతో ఫోటో దిగాలని కొంతమంది భక్తులు పోటీ పడ్డారు. దేవస్థానం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.695 కోట్లతో మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. దీనిని నాలుగు దశల్లో పూర్తిచేయాలని పనులను చేపట్టారు. తొలి దశకు సంబంధించిన రూ.111.25 కోట్ల పనులను 2027 మార్చి 31లోపు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి వర్షాకాలం రాకముందే రూఫ్ లెవల్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది.
Comments