Deputy CM Bhatti Vikramarka's son's Wedding : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య - సాక్షిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని జీఎంఆర్ అరీనాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపార వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ హాజరయ్యారు.ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ నూతన దంపతులను ఆశీర్వదించారు. పాదయాత్ర నిర్వహించిన సమయంలో భట్టి విక్రమార్కను ఆత్మీయంగా దగ్గరకు చేర్చుకున్న పలువురిని సైతం పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజకీయ హోదాల కంటే మనుషుల మధ్య ఉండే అనుబంధాలే గొప్పవని భట్టి నిరూపించారని అందరూ కొనియాడారు.
Comments