Two Wheelers Burnt by The Summer Heat in Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతల ప్రభావానికి ద్విచక్ర వాహనాలు ఉన్నచోటనే దగ్ధం అవడం కలకలం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలోని అక్సా మసీదు సమీపంలో చెట్టు కింద బైక్లను పార్క్ చేశారు. మధ్యాహ్నం సమయంలో వేసవి తాపానికి ఒక బైకులో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న ద్విచక్ర వాహనాలకు సైతం మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో అక్కడున్న వారు ఉలిక్కిపడ్డారు. అప్పటికి స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడమే ఈ ఘటనకి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. వేసవి ఎండల దృష్యా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Comments