Skip to playerSkip to main content
  • 2 days ago
Two Wheelers Burnt by The Summer Heat in Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతల ప్రభావానికి ద్విచక్ర వాహనాలు ఉన్నచోటనే దగ్ధం అవడం కలకలం రేపింది. ఆదిలాబాద్​ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలోని అక్సా మసీదు సమీపంలో చెట్టు కింద బైక్​లను పార్క్ చేశారు. మధ్యాహ్నం సమయంలో వేసవి తాపానికి ఒక బైకులో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న ద్విచక్ర వాహనాలకు సైతం మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో అక్కడున్న వారు ఉలిక్కిపడ్డారు. అప్పటికి స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడమే ఈ ఘటనకి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. వేసవి ఎండల దృష్యా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:19This video is brought to you by Kiko Kiko Kiko Kiko Kiko Kiko.
00:58Transcription by CastingWords
01:02Transcription by CastingWords
Comments

Recommended