Skip to playerSkip to main content
  • 2 days ago
CM Chandrababu Prepare Ragi Malt at Lingamguntla Anganwadi Center : పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లింగంగుంట్ల గ్రామానికి వెళ్లిన ముఖ్యమంత్రి, తొలుత అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలు అందించారు. అనంతరం స్వయంగా రాగిజావ తయారుచేసి సీఎం చంద్రబాబు చిన్నారులకు ఇచ్చి, తానూ తాగారు. తరువాత చిన్నారులతో మమేకమైన సీఎం, వారితో కలిసి కింద కూర్చునే కాసేపు వారితో ముచ్చటించారు. తరువాత పచ్చదనం పెంపులో భాగంగా అంగన్వాడీ కేంద్రం ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన సీఎం, గానుగ ఎక్కి వేరుశెనగ, కొబ్బరినూనె ఉత్పత్తిని పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో సీఎం చంద్రబాబు విత్తనాలు నాటారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
Comments

Recommended