Skip to playerSkip to main content
  • 2 days ago
Several Leaders Joined The Jana Sena Party In Karnataka : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కేంద్రంలో పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీని కర్ణాటకలో విస్తరించాలని అక్కడి ప్రజలు, నాయకుల నుంచి విజ్ఞప్తులు రావడంతో పవన్ కల్యాణ్ ఆ మేరకు చర్యలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. వివిధ పార్టీల నుంచి నాయకులతో 200 మందికి పైగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని అధికారికంగా పార్టీలో చేరారు. వీరందరికీ నాగబాబు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రాంతాలు, భాషలకు అతీతమైనదని, జాతీయవాదాన్ని ప్రోత్సహించే వేదికగా పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన అని, పవన్ వెంట నడిచేందుకు ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Category

🗞
News
Transcript
00:04Thank you very much.
00:48Thank you very much.
Comments

Recommended