Skip to playerSkip to main content
  • 1 year ago
Waves Raising At Konaseema sea : ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం రాత్రి నుంచి తీరం వెంబడి అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి కడలి సుమారు అర కిలోమీటరు మేర చొచ్చుకొచ్చింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సంద్రం పోటెత్తింది. గోదావరి సంగమం, బీచ్ రోడ్డులో అలల ఉద్ధృతి పెరిగింది.

దీంతో పల్లిపాలెంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. మలికిపురం మండలం కేశవదాసుపాలెం, చింతలమమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లోకి ఉప్పునీరు చేరింది. తీరంలోని రొయ్యల చెరువులు నీట మునిగాయి. మామిడికుదురు మండలం కరవాక తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అల్లవరం మండలం ఓడలరేవులో కడలి అల్లకల్లోలంగా ఉంది. ఓఎన్​జీసీ టెర్మినల్‌ను సముద్రపు నీరు ముంచేసింది. పలు ఆక్వా చెరువులు కొట్టుకుపోయాయి.

Category

🗞
News
Comments

Recommended