మనం తప్పు చేయలేదు దైర్యంగా ప్రజల్లోకి వెళ్లండి || Oneindia Telugu

  • 5 years ago
Several Telugu Desam Party Workers and Supporters came Vundavalli residence to meet Former Chief Minister of Andhra Pradesh Chandrababu. They met Chandrababu and declared to moral support to the Party, which was landslide lost their Assembly and Lok Sabha Elections to YSR Congress Party.
#AndhraPradesh
#formercm
#chandrababu
#kuppam
#chittoor
#gannavaram
#Krishna
#workers
#supporters

టీడీపీ గత ప్రభుత్వంలో ఎలాంటీ తప్పు చేయలేదని అందుకే ధైర్యంగా ముందుకు సాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేశాడు. చంద్రబాబు నివాసానికి వచ్చిన కుప్పం నియోజకవర్గం నేతలతో చంద్రబాబు భేటి అయ్యారు. కాగా కుప్పంలో మెజారిటి తగ్గడానికి గల కారణాలను అన్వేషించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. 2014లో 70 వేల మెజారీటి వచ్చిన నేపథ్యంలో 2019 జరిగిన ఎన్నికల్లో మెజారీటీ ముప్పై వేలకు తగ్గింది. దీంతో మెజారీటీ తగ్గడానికి గత కారణాలను అన్వేషించాలని కోరారు. గత ప్రభుత్వ హాయంలో హంద్రీనీవా కాలువ ద్వార కుప్పం శివారు వరకూ నీళ్లు తెచ్చామని అన్నారు. మరో అయిదేళ్లు అధికారం వస్తే సైబారాబాద్ లాంటీ నగరాన్ని నిర్మించేవాళ్లమని వారితో చెప్పారు.కాగా పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షళనా చేస్తానని చంద్రబాబు చెప్పారు.

Recommended