Prajapaalana Themed Ganapati Mandapam : తెలంగాణలో కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన థీమ్ పేరిట ఏర్పాటు చేసిన గణపతి ఆకట్టుకుంటున్నాడు. హైదరాబాద్ గోషామహల్లో కాంగ్రెస్ నేత, రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంస్థ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో బాహుబలి నమూనాలో గణేశుడుని రూపొందించారు. బాహుబలి గణపతిని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న విధంగా ప్రతిమ తయారు చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1000 రోజుల ప్రజాపాలన విజయవంతంగా పూర్తైందని, ఈ సందర్భంగా సాధించిన విజయాలు సూచిస్తూ మండపం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు సంపూర్ణంగా అందాలని కాంక్షిస్తున్నామని సాయి కుమార్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, విజయాలను మండపం లోపల, బయట ప్రత్యేకంగా రాయించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, వంట గ్యాస్ సిలిండర్ రాయితీ, సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
Comments