Skip to playerSkip to main content
  • 21 minutes ago
Ugadi Asthanam In Tirupati : తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుడికి, శ్రీవారి మూలవిరాట్టుకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఆస్థానంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన పరాభవ నామ సంవత్సర పంచాంగంను ఆస్థాన సిద్దాంతి పచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది దేశ, కాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారాది ఫలితాలను తెలియజేశారు. ఉగాది ఆస్థానంను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంతో పాటు పరిసరాల ప్రాంతాలను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల విదేశీ కట్ ఫ్లవర్స్​తో విశేషాలంకరణలు చేశారు. ఉగాది పండుగ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని మామిడాకు, మామిడికాయలు, చెరకుగడలు, టెంకాయపూతతో అలంకరణలు చేశారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా కృత, ద్వాపర, త్రేతాయుగం సెట్టింగ్లు ఆలయం ముందు ఏర్పాటు చేశారు.

Category

🗞
News
Transcript
00:26Thank you very much.
01:26Thank you very much.
01:34Thank you very much.
Comments

Recommended